
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం రిలీజ్ కానున్నాయి. హైదరాబాద్ రవీంద్రభారతిలో మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం రేవంత్ రెడ్డి రిజల్ట్స్ ను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. 5,09,403 మంది హాజరయ్యారు. వారం క్రితమే ఫలితాల ప్రక్రియ పూర్తికాగా.. ఫలితాలు ఎలా ఇవ్వాలనే దానిపై సర్కారు నుంచి స్పష్టత కోసం ఎస్ఎస్సీ బోర్డు అధికారులు వెయిట్ చేశారు. మూడ్రోజుల క్రితం దీనిపై స్పష్టత రావడంతో బుధవారం ఫలితాలు ఇచ్చేందుకు వారు రెడీ అయ్యారు. ఈసారి ఫలితాల్లో గ్రేడ్లకు బదులు మార్కులు ఇవ్వనున్నారు.
సబ్జెక్టులకు మాత్రమే మార్కులు, గ్రేడ్లు ఇవ్వనుండగా, ఓవరాల్ ఫలితాలను మాత్రం కేవలం మార్కుల వరకే పరిమితం చేయనున్నారు. కో కరికులమ్ యాక్టివిటీస్లో కేవలం గ్రేడింగ్ మాత్రమే ప్రకటిస్తారు. ఫలితాలను https://bse.telangana.gov.in, http://https://bse.telangana.gov.in, https://www.v6velugu.com తదితర వెబ్ సైట్లలో చూసుకోవచ్చు.