సిరీస్‌‌‌‌‌‌‌‌పై ఇండియా గురి

సిరీస్‌‌‌‌‌‌‌‌పై ఇండియా గురి
  •     నేడు జింబాబ్వేతో నాలుగో టీ20
  •     సా. 4.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో

హరారే : జింబాబ్వే టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ ఇండియా సిరీస్‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టింది. వరుసగా రెండు విజయాల జోరును కొనసాగిస్తూ  శుక్రవారం జరిగే నాలుగో టీ20లోనూ జింబాబ్వే పని పట్టాలని చూస్తోంది. ఈ పోరులో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకోవాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది.

 మరోవైపు సిరీస్‌‌‌‌‌‌‌‌లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కావడంతో జింబాబ్వేపై తీవ్ర ఒత్తిడి ఉండనుంది. అయితే, ముజరబాని, డియోన్‌‌‌‌‌‌‌‌ మైయర్స్‌‌‌‌‌‌‌‌కు తోడు మిగతా ఆటగాళ్లు పోరాడాలి.