ఇయ్యాల పెద్దపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన

ఇయ్యాల పెద్దపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, దుదిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు శుక్రవారం పర్యటించనున్నారు.

ఓదెల, కాల్వ శ్రీరాంపూర్​ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు కలెక్టర్​ శ్రీహర్ష తెలిపారు. గురువారం రామగుండం సీపీ శ్రీనివాసుతో కలిసి కలెక్టర్​ ఏర్పాట్లను పరిశీలించారు.