దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అంటూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్..

దేవుణ్ణి  రాజకీయాల్లోకి  లాగకండి అంటూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్..

గత కొద్దిరోజులుగా ఏపీలో తిరుమల లడ్డూ వివాదంపై రాజకీయ దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో నెయ్యికి బదులు జంతు నూనె  కలిపినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది ధర్మాసనం. అలాగే  తిరుపతి లడ్డు ప్రసాదం సమస్యని రాజకీయం చెయ్యకుండా సున్నితంగా హ్యాండిల్ చెయ్యాలని సూచిస్తూ రాజీకీయాల్లోకి దేవుడిని లాగద్దంటూ చురకలంటించింది.

ఈ వివాదం రాజకీయాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా దుమారం రేపుతోంది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్.. తాజాగా మరో ట్వీట్ చేశారు. "దేవుణ్ణి  రాజకీయాల్లోకి  లాగకండి" అని ట్వీట్ చేసాడు. అలాగే తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ని షేర్ చేస్తూ జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ టాగ్ ని యాడ్ చేసాడు.

ALSO READ | కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు ఆధారాలు ఎక్కడ: దేవుడిని అయినా రాజకీయాలకు దూరం పెట్టండి : సుప్రీంకోర్టు

అయితే గతంలో ప్రకాష్ రాజ్ లడ్డు ప్రసాదం కాంట్రవర్సీపై స్పందిస్తూ రాష్ట్రంలో దేశంలో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయని దీంతో వాటిపై దృష్టి సారించాలని అన్నాడు. అంతేగాకుండా అధరాలు లేకుండా లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఎటువంటి ప్రచారాలు చెయ్యకుండా సున్నితంగా పరిష్కరించాలని కూడా సూచించాడు. 

కానీ కొందరు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాల కోసం  తిరువతి లడ్డు ప్రసాదం కెళ్తే విషయాన్ని రచ్చకెక్కించి లబ్ధి పొందాలని చూస్తున్నట్లు ప్రకాష్ రాజ్ పలు ఆరోపణలు చేశాడు.