1800 కాల్స్ వచ్చాయి.. వైసీపీ వేధింపుల దెబ్బకు హాస్పిటల్లో పడ్డాను: పృథ్వీ

1800 కాల్స్ వచ్చాయి.. వైసీపీ వేధింపుల దెబ్బకు హాస్పిటల్లో పడ్డాను: పృథ్వీ

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. విశ్వక్సేన్ ‘లైలా’ సినిమా ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలను వైసీపీ కార్యకర్తలు తమకు ఆపాదించుకుని, తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. తాను ఒక నటుడిగా సినిమా ఫంక్షన్ వేదికపై మాట్లాడిన మాటలను వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసిందని చెప్పాడు. తాను ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడలేదని, అక్కడికి వచ్చిన ప్రేక్షకులను నవ్వించడానికే అలా మాట్లాడనని తెలిపాడు. కానీ అది వైసీపీకి ఆపాదించుకుని ప్రచారం చేసుకున్నారని పృథ్వీ చెప్పుకొచ్చాడు.

Also Read :- ఫోన్లు, మెసేజ్‎లతో వేధిస్తున్నారు

గత రెండు రోజులుగా తనను సోషల్ మీడియాలో తీవ్రంగా వేధిస్తున్నారని, తన ఫోన్ నెంబర్ వైసీపీ సోషల్ మీడియా గ్రూప్ల్లో పెట్టి మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు 1800 కాల్స్ చేయించారని, తన భార్యను , తల్లిని , పిల్లలను తిట్టించారని.. వైసీపీ సోషల్ మీడియా వేధింపుల వల్ల తాను హాస్పిటల్లో జాయిన్ అయ్యానని పృథ్వీ చెప్పాడు.

అనిల్ అనే పేరుతో పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు. ఏపీ హోంమంత్రిని కూడా కలిసి త్వరలో ఫిర్యాదు చేస్తానని, వేధించిన వాళ్లపై కోటి రూపాయల పరువునష్ట దావా వేస్తానని నటుడు పృథ్వీ చెప్పాడు.