మైఖేల్ జాక్సన్ బయోపిక్ పై కన్నేసిన తెలుగు డైరెక్టర్.. హాలీవుడ్ లో హిట్ తప్పదు...

మైఖేల్ జాక్సన్ బయోపిక్ పై కన్నేసిన తెలుగు డైరెక్టర్.. హాలీవుడ్ లో హిట్ తప్పదు...

తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రంతో  డైరెక్టర్ గా పరిచయమైన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి  తెలియని వారు ఉండరు. అయితే సందీప్ రెడ్డి ఈ మధ్య బాలీవుడ్ పై ఆసక్తి చూపిస్తున్నాడు. గతంలో సందీప్ రెడ్డి బాలీవుడ్ లో డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్(అర్జున్ రెడ్డి హిందీ రీమేక్), ఆనిమల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘాన విజయం సాధించాయి. దీంతో ప్రస్తుతం సందీప్ రెడ్డి తన తదుపరి చిత్ర స్క్రిప్ట్ పై పని చేస్తున్నాడు.

అయితే తాజాగా సందీప్ రెడ్డి తాజాగా ప్రముఖ దివంగత డ్యాన్సర్  మైఖేల్ జాక్సన్ బయోపిక్ గురించి స్పందించాడు. ఇందులో భాగంగా తనకి మైఖేల్ జాక్సన్ బయోపిక్ తెరకెక్కించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. మైఖేల్ జాక్సన్ జీవితంలో అతడి చిన్నతనం, విద్య, కెరీర్ ముఖ్యంగా అతడి శరీర రంగుని ఎలా మార్చుకోగలిగాడనే విషయాలు చాల ఆసక్తికరంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ బయోపిక్ లో మైఖేల్ జాక్సన్  పాత్రలో ఎవరు నటిస్తారనే పెద్ద ప్రశ్న అని అలాగే ఈ పాత్రలో నటించడమనేది పెద్ద ఛాలెంజ్ అని అభిప్రాయపడ్డాడు. అంతేగాకుండా ఈ బయోపిక్ ని హాలీవుడ్ మరియు బాలీవుడ్ లో తెరకెకెక్కించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఒకవేళ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ని తాను కాకుండా ఎవరు తీసినాసరే కచ్చితంగా టికెట్ కొని చూస్తానని తెలిపాడు. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా తెలుగులో స్పిరిట్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, సలార్ 2, తదితర చిత్రాల షూటింగులో బిజీగా ఉండటంతో వచ్చే ఏడాది స్పిరిట్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.