వరద బాధితులకు అండగా టాలీవుడ్..ఎవరెవరు ఎంత ఇచ్చారంటే?

వరద బాధితులకు అండగా టాలీవుడ్..ఎవరెవరు ఎంత ఇచ్చారంటే?

తమ సినిమాలను చూసి ఆదరించి, అభిమానించే తెలుగు ప్రేక్షకులను ప్రకృతి విపత్తుల నుంచి ఆదుకునేందుకు టాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినీ ప్రముఖులు ఎప్పుడూ ముందుంటారు.  జనానికి అండగా నిలిచేందుకు, తమకు చేతనైనంత సాయం చేసేందుకు ముందుకొచ్చే టాలీవుడ్ స్టార్స్ మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా విరాళాలను ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు కోటి రూపాయలు ప్రకటించారు. ఇందులో తెలంగాణకు రూ.50 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.50 లక్షలు చొప్పున సీఎం రిలీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందజేయనున్నారు.

అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా  వ్యక్తిగతంగా  కోటి రూపాయల విరాళం ప్రకటించారు.  ఇక యువహీరోలు సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి రూ.15 లక్షలు, తెలంగాణకు రూ.15 లక్షలు చొప్పున ముప్ఫై లక్షలు అనౌన్స్ చేశాడు. అలాగే విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణకు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు. నిర్మాతలు ఎస్.రాధాకృష్ణ, నాగవంశీలతో కలిసి  దర్శకుడు త్రివిక్రమ్ రెండు రాష్ట్రాలకు చెరొక రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించారు. 

నిర్మాత అశ్వినీదత్ ఏపీకి రూ.25 లక్షల విరాళం అందజేస్తామన్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెలంగాణకు రూ.5 లక్షలు, ఏపీకి రూ.5 లక్షలు చొప్పున ప్రకటించాడు. ఇక హీరోయిన్ అనన్య నాగళ్ల  తెలుగు రాష్ట్రాలకు చెరో రెండున్నర లక్షల చొప్పున  ప్రకటించింది.  ఆపదలో ఉన్న ప్రజల కోసం సెలబ్రిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందుకొచ్చి ఆపన్న హస్తం అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.