హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తెలుగు హీరోయిన్.. ఏమైందంటే..?

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తెలుగు హీరోయిన్.. ఏమైందంటే..?

ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది పంజాబ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. కానీ రకుల్ ప్రీత్ సింగ్ కి రాన్రానూ బాలీవుడ్ పై మక్కువ పెరగడంతో టాలీవుడ్ ని పక్కన పెట్టింది. దీంతో తెలుగు సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదని టాలీవుడ్ సినివర్గాలు చర్చించుకుంటున్నాయి. 

అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఆమధ్య జిమ్ లో వర్కవుట్లు చేస్తున్న సమయంలో కొంతమేర గాయపడి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ లో చేరింది. దీంతో అప్పటినుంచి రకుల్ ప్రీత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ ఓ వీడియో ద్వారా హెల్త్ అప్డేట్ ఇచ్చింది.

ఇందులోభాగంగా తాను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నట్లు తెలిపింది. అలాగే తాను జిమ్ వర్కవుట్ చేసే సమయంలో పరిమితికి మించి బరువులు ఎత్తడంతో తనకి ఇబ్బంది కలిగిందని దీంతో కొన్ని రోజులపాటూ విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలిపింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొంది. ఇక తాను తవరగా కోలుకోవాలని అ దేవుడిని ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.

ALSO READ | ఒకేరోజు పవన్, ప్రభాస్ సినిమాల షూటింగ్లో పాల్గొన్న ముంబై బ్యూటీ 

ఈ విషయం ఇలా ఉండగా నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేసిన భారతీయుడు 2 చిత్రంలో కీలక పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ప్రస్తుతం హిందీలో ప్రముఖ హీరో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న దే దే ప్యార్ దే 2'లో నటిస్తోంది. కాగా ఈ సినిమాకి హిందీ ప్రముఖ దర్శకుడు అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 1, 2025న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.