Mahesh Babu: సీఎం రేవంత్ రెడ్డికి రూ.50 లక్షల చెక్కును అందజేసిన మహేష్ బాబు దంపతులు

Mahesh Babu: సీఎం రేవంత్ రెడ్డికి రూ.50 లక్షల చెక్కును అందజేసిన మహేష్ బాబు దంపతులు

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) దంపతులు ఇవాళ సోమవారం (సెప్టెంబర్ 23న) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో భేటీ అయ్యారు.

ఈ మేరకు సోమవారం వరద బాధితుల సహాయార్థం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆయన నివాసంలో కలిసి..తెలంగాణలో వరద బాధితుల కోసం రూ.50 లక్షల చెక్కును అందజేశారు.

వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన మల్టీప్లెక్స్ AMB నుండి అదనంగా మరో రూ. 10 లక్షలను విరాళంగా ఇచ్చారు. మహేశ్ బాబుతో పాటు ఆయన సతీమణి నమ్రత, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ ఉన్నారు. ఈ విపత్తు సమయంలో సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న మహేష్ బాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

ఇటీవల సంభవించిన ప్రకృతి విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడటంతో టాలీవుడ్ హీరోలు తమ వంతు సాయాన్ని ప్రకటించారు. 

ప్రస్తుతం మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజ మౌళి సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో రాబోతుంది.

Also Read:- ఫ్యామిలీతో అమెరికా వెళ్లిన ఎన్టీఆర్

2025 ప్రారంభంలో ఈ సినిమా ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. సినిమా కోసం సూపర్ స్టార్ భారీగా గడ్డం పెంచేశాడు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్టు సమాచారం. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు గడ్డంతో ఉన్న ఈ లుక్స్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.