సత్యం సుందరం టీమ్ కి అభినందనలు తెలిపిన హీరో నాగార్జున.

సత్యం సుందరం టీమ్ కి అభినందనలు తెలిపిన హీరో నాగార్జున.

ప్రముఖ తమిళ్ హీరోలైన అరవింద్ స్వామి, కార్తీ హీరోలుగా నటించిన సత్యం సుందరం మల్టీస్టారర్ చిత్రం సెప్టెంబర్ 28వ తారీఖున తెలుగు తమిళ్ భాషలలో విడుదలైన విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో అరవింద్ స్వామి, కార్తీలు స్నేహితుల పాత్రలో నటించి తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. 

ఫ్రెండ్ షిప్ సెంటిమెంట్ అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అంతేగాకుండా 3 రోజుల్లోనే దాదాపుగా రూ.22 కోట్ల(గ్రాస్)కి పైగా వసూళ్లు సాధించింది. అలాగే రోజురోజుకి మౌత్  టాక్ పబ్లిసిటీ పెరుగుతుండటంతో రూ. 45 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని చేరుకునే వైపు సాగుతోంది.

ALSO READ | Satyam Sundaram Review: 'సత్యం సుందరం' మూవీ రివ్యూ.. ఫీల్‌గుడ్ ఎమోష‌న్తో కట్టిపడేసిన కార్తి

అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరో నాగార్జున సత్యం సుందరం చిత్ర యూనిట్ కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఇందులో భాగంగా తాను సత్యం సుందరం చిత్రాన్ని చూశానని, దీంతో తనకి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని తెలిపాడు. అలాగే ఈ చిత్రం చూస్తున్నసేపు చాలా ఎంజాయ్ చేశానని చెప్పుకోచ్చాడు. 

గతంలో తాను కార్తీ కలసి ఊపిరి చిత్రంలో నటించిన సమయంలోని కొన్ని మెమొరీస్ గుర్తొచ్చాయని, అలాగే ఇంత మంచి సినిమాని ప్రేక్షకులకు అందించినందుకు మొత్తం సినిమా టీమ్ కి అభినందనలు తెలియజేశాడు. దీంతో హీరో అరవింద్ స్వామి స్పందిస్తూ థాంక్ యూ అంటూ నాగార్జున ట్వీట్ కి రిప్లై ఇచ్చారు.