సినిమాల్లో మహిళలని అలా చూపిస్తున్నారంటూ సీనియర్ హీరోయిన్ సంచలనం..

సినిమాల్లో మహిళలని అలా చూపిస్తున్నారంటూ సీనియర్ హీరోయిన్ సంచలనం..

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన సీనియర్ హీరోయిన్ సుహాసిని గురించి సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. నటి సుహాసిని ప్రముఖ డైరక్టర్ మణిరత్నం ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్ళయిన తర్వాత కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తూ అమ్మ, అక్క, చెల్లి తదితర పాత్రలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. సుహాసిని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో మహిళా నటీమణుల పరిస్తితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఇందులో భాగంగా ఒకప్పుడు సినిమాల్లోతప్పుడు బొల్డ్ సన్నివేశాల విషయంలో హీరోయిన్లు చాలా జాగ్రత్తలు తీసుకునేవారని అలాగే ఇలాంటి పాత్రలు చేయడానికి వెనుకాడేవారని కానీ నేటితరం నటీమణులు చాలా సునాయాసంగా నాటిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే 2010 వ సంవత్సరం తర్వాత మహిళా నటీమణుల పాత్రలపట్ల గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపింది. 

ALSO READ | ఉపాసన పెద్ద మనసు... రేణు దేశాయ్ కి సాయం

ఇందులో ముఖ్యంగా సినిమాల్లో హీరోయిన్ల పాత్రకి ప్రాధాన్యత లేకపోవడం, నిడివి తక్కువగా ఉండటం, ఎక్కువగా బొల్డ్ సన్నివేశాలకోసమే ఎక్కువగా హీరోయిన్లని ఉపయోగించడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంకొందరు భావ ప్రకటన స్వేచ్చ హక్కు పేరుతో ఏకంగా మహిళలని తక్కువ చేసి చూపిస్తున్నారని ఇది సరికాదని పేర్కొంది. సినిమా ఇండస్ట్రీలో మహిళా నటులపట్ల చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ విషయం ఇలా ఉండగా నటి సుహాసిని ఈ మధ్య సినిమాల్లో నటించడం తగ్గించేసింది. ఈ క్రమంలో తన భర్త మణిరత్నం పని చేస్తున్న సినిమాలకి స్క్రిప్ట్, డైలాగ్స్ విషయంలో సహాయం చేస్తోంది.