
- మెదక్ జిల్లా చిలప్ చెడ్ తహసీల్దార్ఆఫీసు ఎదుట నిరసన
మెదక్ (చిలప్ చెడ్), వెలుగు : తమ పోలింగ్బూత్ మార్చాలని మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం టోప్య తండా గిరిజనులు డిమాండ్ చేశారు. తండాలో 400 ఓట్లుండగా అక్కడే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయకుండా కిలోమీటర్ దూరంలోని గౌతాపూర్ కు మార్చడంతో ఓటు వేసేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు.
బుధవారం సర్పంచ్ హనీభాయ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేశ్ నాయక్, బీజేపీ జిల్లా ఎస్టీమోర్చా ఉపాధ్యక్షుడు కిషన్ నాయక్ ఆధ్వర్యంలో తండా వాసులు, యువకులు తహసీల్దార్ఆఫీస్కు వచ్చి నిరసన తెలిపారు. సీ విజిల్టీం, ఎంపీడీవో, తహసీల్దార్ అక్కడికి వచ్చి గిరిజనులతో చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ముసాదిక్ మాట్లాడుతూ పోలింగ్ బూత్ మార్చాలని తండా వాసులు కోరారని, విషయాన్ని జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్, నర్సాపూర్ సెగ్మెంట్ రిటర్నింగ్ ఆఫీసర్దృష్టికి తీసుకువెళ్తామన్నారు.