
టోర్బ్జోర్న్ పెడెర్సెన్ది డెన్మార్క్. ఇతను ఒక్క ఫ్లయిట్ జర్నీ కూడా చేయకుండా ఏకంగా 195 దేశాలు ట్రావెల్ చేశాడు. టోర్బ్జోర్న్ 2013లో ఈ జర్నీ స్టార్ట్ చేశాడు. ట్రావెల్ చేయడానికి కావాల్సిన షర్ట్స్, జాకెట్స్, షూస్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటివన్నీ తనతో పాటు తీసుకెళ్లాడు. నాలుగేండ్ల తర్వాత కోపెన్హగన్కు తిరిగి రావచ్చు అనుకున్న అతనికి అదనంగా ఆరేండ్లు ఎక్కువ టైం పట్టింది. దాదాపు 2,60,000 మైళ్ల ప్రయాణంలో కారు, రైలు, బస్, ట్యాక్సీ, బోట్, షిప్పింగ్ కంటెయినర్స్లో జర్నీ చేశాడు.
కొన్నిసార్లు కాలినడకన కూడా వెళ్లాడు. ఈ జర్నీలో అతడికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వీసా ఇష్యూస్ నుంచి చావు అంచుల దాకా అన్నీ చూశాడట టోర్బ్. అయినా సరే అవన్నీ తట్టుకున్నాడు. అదెలా? అనడిగితే... ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో తిరిగిన టూరిస్ట్ల గురించి చదివి ఇన్స్పైర్ అయ్యాడట. దాంతో అడ్వెంచర్ చేయాలనే ఆలోచనతో 2013, అక్టోబర్లో డెన్మార్క్ నుంచి జర్మనీకి ట్రైన్ జర్నీ చేశాడు. ఆ తర్వాత అదే కంటిన్యూ చేశాడు. అయితే రోజుకి కేవలం ఇరవై డాలర్లు ఖర్చు చేశాడట. ప్రతి దేశంలో హాస్టల్స్లో ఉండేవాడట.
సవాళ్లను ఎదిరించి.. పెండ్లి చేసుకుని
2013లో ప్రయాణం మొదలైన తర్వాత మొదటిసారి ఒక సవాలు ఎదురైంది అతనికి. నార్వే నుంచి ఫరో ఐలాండ్కు సముద్రం మీద జర్నీ చేయాలనుకున్నాడు. కానీ, తనను తీసుకెళ్లే బోట్ కనిపించలేదు. దాంతో షిప్పింగ్ కంపెనీలోనే మూడు రోజులు స్టక్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్లీ జర్నీ కంటిన్యూ చేశాడు. అలాగే 2014లో ప్రమాదకర పరిస్థితుల్లో ఐస్లాండ్లో బోట్ రైడ్కి వెళ్లాడు. ఆ మరుసటి ఏడాది టోర్న్కి సెరిబ్రల్ మలేరియా ఉన్నట్టు డాక్టర్ చెకప్లో తెలిసింది. అది హాలూసినేషన్స్కి(లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు భ్రాంతి చెందడం) దారి తీస్తుంది. దాంతోపాటు చిన్న పనులు చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది అని చెప్పారు డాక్టర్స్. ఇలాంటి టైంలోనే అతను ఒంటరితనం, అలసట వంటి ఆలోచనలతో పోరాడాడు.
ఇక ఆఫ్రికా జంగిల్లో 2016లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఆ అడవిలో తాగి డాన్స్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులు టోర్న్ దగ్గరకి వెళ్లి తలకు గన్ గురిపెట్టారు. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ, వాళ్లు అతన్ని ఏం చేయకుండా వదిలిపెట్టేశారు. ఇవే కాకుండా వీసా అప్లికేషన్స్ మాటిమాటికి రిజెక్ట్ అయ్యేవి కూడా. ఈ ప్రయాణంలో ట్యాక్సీ డ్రైవర్స్, వేరే దేశాల్లో ఉన్న ఫ్రెండ్స్ సాయం తీసుకున్నాడు. ఈ జర్నీలోనే అతనికి గర్ల్ ఫ్రెండ్ కలిసింది. ఆమెకు ప్రపోజ్ కూడా చేశాడు. 2019లో నార్త్ కొరియా నుంచి బీజింగ్కు ట్రావెలర్స్తో కలిసి జర్నీ చేశాడు. 2020 నాటికి హాంకాంగ్ చేరుకున్నాడు. ప్యాండెమిక్ కావడంతో తను అక్కడే ఒక చర్చిలో పని చేస్తూ ఉండిపోయాడు.
ఆ చర్చి వాళ్లే అతనికి షెల్టర్ ఇచ్చారు. 2022లో వనవాటు దేశంలో పెండ్లి కూడా చేసుకున్నాడు. అదే ఏడు మాల్దీవ్స్కి వెళ్లాడు. అదే అతను వెళ్లిన చివరి దేశం. ఆ తర్వాత రెండు నెలలు మహాసముద్రాల్లో ప్రయాణిస్తూ డెన్మార్క్ చేరుకున్నాడు. అతను ఇంటికి చేరుకోగానే 150 మంది ప్రజలు అతనికి ఘనంగా స్వాగతం పలికారు. ఇదే టోర్బ్ జోర్న్ ఇంట్రెస్టింగ్ ట్రావెల్ జర్నీ.
ఎవరైనా ట్రిప్కి వెళ్తే మూడు లేదా నాలుగు రోజులు ఉంటారు. కొందరు వారం లేదా పది రోజులు ట్రిప్ వేస్తారు. కానీ, ఈ మహానుభావుడు మాత్రం ఏకంగా పదేండ్లు ట్రిప్కి వెళ్లి ఇప్పుడు ఇంటికి వచ్చాడు. అయితే తను వెళ్లింది ఒకటో రెండో ప్రదేశాలకు కాదు.. ప్రపంచంలోని ప్రతి దేశానికి వెళ్లొచ్చాడు. విదేశాలకు వెళ్లాలంటే విమానంలో ప్రయాణించాల్సిందే అనుకుంటున్నారా! ఇతను ఒక్కసారి కూడా ఫ్లయిట్ ఎక్కలేదు. అయినా అన్ని దేశాలూ తిరిగొచ్చాడట!