- ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం
మంచిర్యాల, వెలుగు: హార్ట్ఎటాక్ కేసుల్లో గోల్డెన్అవర్ ఎంతో కీలకమని, ఏమాత్రం ఆలస్యమైనా పేషెంట్ ప్రాణాలకే ప్రమాదమని మంచిర్యాల లోని టచ్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేశ్ బుర్కుండే అన్నారు. అవగాహన లేక ఆలస్యంగా హాస్పిటల్కు రావడం వల్ల వారిని కాపాడడం కష్టమవుతోందన్నారు. మంగళవారం ఆయన డాక్టర్ వికాస్తో కలిసి మీడియాతో మాట్లాడారు. స్ట్రోక్వచ్చిన వారిలో 50 శాతం మంది హాస్పిటల్కు చేరకముందే చనిపోతున్నారని, సివియర్అటాక్ కేసుల్లో హాస్పిటల్కు వచ్చాక కూడా 90 శాతం మరణించే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఛాతిలో నొప్పి వచ్చిన తర్వాత గంటలోగా హాస్పిటల్కు చేరితే ప్రాణాలను కాపాడే చాన్స్ ఉంటుందన్నారు.
కానీ ఆలస్యమైతే గుండె కండరాలకు శాశ్వత నష్టం ఏర్పడుతుందన్నారు. ఇటీవల ఓ పేషెంట్100 శాతం హార్ట్ బ్లాకేజ్, బ్రెయిన్ స్ట్రోక్తో సకాలంలో హాస్పిటల్కు రావడంతో యాంజియోప్లాస్టీ నిర్వహించి బ్లాకేజీని తొలగించడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. ఛాతిలో నొప్పి వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.