భేషజాలు వద్దు.. అందరిని కలుపుకోని పోవాలె: టీపీసీసీ చీఫ్

భేషజాలు వద్దు.. అందరిని కలుపుకోని పోవాలె: టీపీసీసీ చీఫ్
  • క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదు
  • ఇంచార్జిలు అందరిని కలుపుకోని పోవాలె 
  • ఉమ్మడి మెదక్​జిల్లా నాయకులకు టీపీసీసీ చీఫ్​వార్నింగ్​

హైదరాబాద్: నియోజకవర్గ ఇంచార్జిలు భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్​ సూచించారు. ఇవాళ గాంధీభవన్​లో  మెదక్ ఉమ్మడి జిల్లా నాయకుల సమావేశంలో పీసీసీ చీఫ్​ మాట్లాడారు. పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా కీలకమని, దీనిని ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్​ఇచ్చారు.  స్థానిక సంస్థల, ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోని, కష్టపడి పనిచేయాలని సూచించారు. 

ప్రభుత్వ స్కీంలను జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.  ఉమ్మడి మెదక్​ జిల్లాలో గ్రౌండ్​లెవల్​లో పార్టీ కోసం నాయకులంతా మరింత గట్టిగా పనిచేయాలన్నారు.  నియోజకవర్గ ఇంచార్జిలు అందరినీ కలుపుకొని పోవాలన్నారు.  రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలన్నారు.

పార్టీకి మెదక్ ​కీలకం 

కాంగ్రెస్ పార్టీకి మెదక్​తో అత్యంత ప్రాముఖ్యత ఉందని, ఇక్కడ గతంలో ఇందిరాగాంధీ ఎంపీగా పనిచేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్​మున్షీ అన్నారు. ఉమ్మడి మెదక్​జిల్లా నాయకులతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు.. మెదక్​లో కేసీఆర్, హరీశ్​రావు లాంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నాయని ఈ క్రమంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. 

రాబోయే లోకల్​ బాడీ ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకువచ్చేలా పనిచేయాలని సూచించారు. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్లాయన్నారు.  బీజేపీ, బీఆర్ఎస్​లు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.  నాయకులు  పట్టుదల, సమన్వయంతో పనిచేస్తే మంచి రిజల్ట్స్​ వస్తాయన్నారు.