కేసీఆర్ లాగా ఉత్తుత్తి జీవోలు ఇయ్యం.. టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

కేసీఆర్ లాగా ఉత్తుత్తి జీవోలు ఇయ్యం.. టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  • రిటైర్డ్​ ఎంప్లాయిస్ ​సమస్యలను పరిష్కరిస్తం

హైదరాబాద్: రిటైర్డ్​ఎంప్లాయిస్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు మహేశ్​కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి  అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు తాము ఎదుర్కొంటున్న ఈహెచ్ఎస్, పలు సమస్యలను పీసీసీ చీఫ్  దృష్టికి తీసుకువచ్చారు.

ALSO READ | మూసీలో ఇప్పటి వరకు ఒక్క పేదవాడి ఇల్లు కూల్చలేదు : టీ పీసీసీ చీఫ్

అనంతరం మహేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతోందన్నారు. ‘కేసీఆర్​లాగా ఉత్తుత్తి జీవోలు విడుదల చేయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో బాధ్యతతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈహెచ్ఎస్​ పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తం. విశ్రాంత ఉద్యోగుల సంఘం భవన నిర్మాణానికి సీఎంతో చర్చించి త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు.