సర్ధార్ ​వల్లబాయ్​ పటేల్‎కు బీజేపీకి సంబంధమే లేదు

సర్ధార్ ​వల్లబాయ్​ పటేల్‎కు బీజేపీకి సంబంధమే లేదు

హైదరాబాద్:  తెలంగాణ విలీనం అయినప్పుడు బీజేపీ పుట్టనే లేదని,  బీజేపీ దిగజారుడు రాజకీయాలు  చేస్తుందని  టీపీసీసీ ఛీప్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ విమర్శించారు.  ఇవాళ గాంధీభవన్​వద్ద తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..  తెలంగాణ విలీనం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు.  సర్ధార్​వల్లభాయ్​పటేల్‎కు  బీజేపీకి ఏం సంబంధం. వల్లభాయ్​పటేల్‎ను బీజేపీ తన నాయకుడిగా చెప్పుకుంటుంది. కాంగ్రెస్​వల్లనే  దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశంలో హైదరాబాద్​సంస్థానం విలీనం అయింది. సెప్టెంబర్ 17 1948  వరకు మన సంస్థానంకి స్వతంత్రం రాలేదు. దూర దృష్టి తో అప్పటి ప్రధాని  నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్‎ని పంపి దేశంలో విలీనం చేయించారు. చరిత్ర తెలుసుకోకుండా అందరూ మాట్లాతున్నారు. స్వతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్రనే లేదు.  

అనాడు ఉన్న ఇప్పటీ  బీజేపీ అనుబంధ సంఘాలు  బ్రిటిష్ పాలకులకు వత్తాసు పలికారు. పదేళ్లు తెలంగాణను కేసీఆర్​తుంగలో తొక్కారు.  రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.   ఐటీ రంగాన్ని దేశానికి  పరిచయం చేసింది రాజీవ్ గాంధీ.  కేటీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.  కేటీఆర్​కు  పదేళ్లు తెలంగాణ తల్లి గుర్తుకు రాలేదా?  తెలంగాణ తల్లిని గౌరవించాలని..   తెలంగాణ తల్లి విగ్రహాన్ని  ప్రభుత్వం సెక్రటేరియట్​ గుండెల్లో పెడుతుంది.  బీజేపీ పెట్టే చిచ్చులో పడదామా..?  కాంగ్రెస్ ఇచ్చే సంక్షేమ పథకాలను పొంది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుద్దామా..?  ప్రజలు ఆలోచన చేయాలని  పీసీసీ చీఫ్​ అన్నారు.