
జగిత్యాల జిల్లా కోరుట్ల తహశీల్దార్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. ఆఫీసు ఆవరణలోని ఉన్న ట్రాక్టరును దొంగిలించారు. పూల వాగునుంచి ఇసుక అక్రమరవాణా చేస్తున్న ట్రాక్టర్, జేసీబీ ను రెవిన్యూ అధికారులు పట్టుకుని సీజ్ చేసి రెవిన్యూ కార్యాలయంలో ఉంచారు. ట్రాక్టర్ యజమాని ఆఫీసులో ఎవరూ లేని సమయం చూసి అనుమతి లేకుండా తీసుకెళ్లడు. అయితే ట్రాక్టర్ చోరీకి గురైందని తెలుసుకున్న పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమయ్యారు. విషయం తెలుసుకున్న ట్రాక్టర్ యజమాని రెవిన్యూ అధికారులకు లొంగిపోయి తానే తీసుకెళ్లనని చెప్పడంతో.. యజమానికి జరిమానా విధించారు.