
హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట నుంచి హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవేతో తమ షాప్లు పోతున్నాయని హుస్నాబాద్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. హైవే నిర్మాణాన్ని ఇక్కడ 100 ఫీట్లు కాకుండా 80 ఫీట్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇందుకు అధికారులు ఒప్పుకోకపోవడంతో శనివారం మెయిన్రోడ్డుకు ఇరువైపులా ఉన్న 800 షాప్లను బంద్ చేసి నిరసనకు దిగారు.
అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. హైవే నిర్మాణంతో కొన్ని షాప్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా పోతున్నాయని షాప్లు లేకుంటే తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. అధికారులు దీనిని దృష్టిలో ఉంచుకొని హైవేను హుస్నాబాద్లో 80 ఫీట్లతోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.