
హైదరాబాద్సిటీ, వెలుగు: మల్కాజిగిరిలోని పలు ప్రాంతాల్లో రోడ్ల రిపేర్కారణంగా ఈ నెల 27 నుంచి మే 26 వరకు ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్టు రాచకొండ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. గోపాల్ నగర్ నుంచి స్ర్పింగ్హాస్పిటల్దారిలో పనులు జరుగుతున్నందున వాహనాలను ఈసీఐఎల్ నుంచి జెడ్ఆర్టీఐ సిగ్నల్స్వరకు, లాలాపేట నుంచి తార్నాక వెళ్లే వాహనాలను రమాదేవి సిగ్నల్స్వైపు మళ్లించనున్నట్లు పేర్కొన్నారు.
వాహనదారులు ప్రత్యామ్నాయంగా హెచ్బీ కాలనీ, యునాని హాస్పిటల్, జెడ్ఆర్టీఐవై జంక్షన్ మీదుగా జెడ్ఆర్టీఐ సిగ్నల్, లాలాపేట, తార్నాక వైపు వెళ్లాలని సూచించారు. అలాగే, తార్నాక, లాలాపేట, జెడ్ఆర్టీఐ సిగ్నల్ వైపు నుంచి ఈసీఐఎల్వైపు వెళ్లే వాహనాలను జెడ్ఆర్టీఐ జంక్షన్ వైపు మళ్లిస్తామన్నారు. వాహనదారులు ఎన్టీఆర్విగ్రహం, హెచ్ బీ కాలనీ, రమాదేవి సిగ్నల్ నుంచి ఈసీఐఎల్ కు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.