టాయ్ ట్రెయిన్​ బోల్తాపడి.. బాలుడి దుర్మరణం

టాయ్ ట్రెయిన్​ బోల్తాపడి.. బాలుడి దుర్మరణం

చండీగఢ్: పంజాబ్​లో విషాదం చోటుచేసుకుంది. ఓ మాల్‌‌‌‌లో టాయ్ ట్రెయిన్ బోల్తా పడి పదేండ్ల బాలుడు మృతి చెందాడు. పంజాబ్‌‌‌‌లోని నవాన్‌‌‌‌షహర్‌‌‌‌లో గల బాలాచౌర్‌‌‌‌కు చెందిన బాలుడి కుటుంబం కాలక్షేపం కోసం శనివారం రాత్రి అక్కడికి దగ్గర్లోని ఎలాంటే మాల్‌‌‌‌ కు వెళ్లారు. అక్కడ బాలుడు ట్రాయ్​ట్రెయిన్​ ఎక్కి చివరి కంపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో కూర్చున్నాడు. మలుపు తిరుగుతున్న సమయంలో ట్రెయిన్ ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో బాలుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ బాలుడిని సెక్టార్ 32లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్​మెంట్ ​పొందుతూ బాలుడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మాల్​కు చేరుకొని టాయ్ ట్రెయిన్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రైలు నడిపిన వ్యక్తితో పాటు మాల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.