
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో విషాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి పిల్లోనీగుడా వాగులో పడి మృతి చెందాడు. కొత్తూరు మండలం మద్దూరు రాంసింగ్ తాండాకు చెందిన దేజ్యాగ అనే వ్యక్తి పాలమాకుల వెళ్లి తిరిగి వస్తుండగా పిల్లోనీగుడా వాగు వద్ద బైక్ అదుపుతప్పి అందులో పడిపోయింది. ఇవాళ ఉదయం మృతదేహం నీటిపై తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
వర్షాకాలం కావడంతో వాగు మరమ్మతు పనులు సగం వరకే చేసి ఏలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టలేదు. రెండు మూడు గ్రామాలకు వెళ్లాలంటే ఇదే మార్గం గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా వాగు పనులు పూర్తి చేయడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆరోపించారు.