రాళ్లగూడలో ఘోరం..చిన్నారిపై నుంచి వెళ్లిన ఆటో​.. అక్కడికక్కడే మృతి

రాళ్లగూడలో ఘోరం..చిన్నారిపై నుంచి వెళ్లిన ఆటో​.. అక్కడికక్కడే మృతి

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలం రాళ్లగూడ దొడ్డి ఇంద్రారెడ్డి కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి ఆటో ట్రాలీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. నాగర్​కర్నూల్​జిల్లా మరికల్​గ్రామానికి చెందిన శివశంకర్, రేణుక దంపతులకు కీర్తి అనే ఏడాదిన్నర కూతురు ఉంది. శుక్రవారం ఇంద్రారెడ్డి కాలనీలో శ్లాబ్ నిర్మాణ పనులకు వచ్చిన శివశంకర్, రేణుక పాపను కూడా తీసుకొచ్చారు. 

ఇంటి ముందు వదిలి.. పనుల్లో నిమగ్నమయ్యారు. అదే టైంలో సిమెంట్​లోడుతో వచ్చిన ఆటో ట్రాలీ పాపను తొక్కించుకుంటూ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. కండ్ల ముందే కూతురు చనిపోవడంతో తల్లితండ్రులు బోరున విలపించారు. ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.