బొగ్గు గనిలో కార్మికుడు మృతి

బొగ్గు గనిలో కార్మికుడు మృతి
  • మంచిర్యాల జిల్లా జైపూర్  మండలం ఇందారం-1ఏ గనిలో ఘటన

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్  మండలం శ్రీరాంపూర్​ ఏరియాలోని ఇందారం-1ఏ గనిలో డ్యూటీ చేస్తూ జనరల్​మజ్దూర్​ కార్మికుడు పచ్చునూరి రాంచందర్(32) చనిపోయాడు. ఉదయం మొదటి షిఫ్ట్​లో భాగంగా మ్యాన్​ రైడింగ్​ ఆపరేటర్​గా రాంచందర్  గనిలోని మూడో డిప్, జీరో లెవల్​ వద్ద ఉన్న రెండో మ్యాన్​ రైడింగ్  వద్ద పని చేస్తున్నాడు. కొద్ది సేపటి తరువాత రాంచందర్​పని చేస్తున్న స్థలంలోనే కూప్పకూలాడు. తోటి కార్మికులు, ఆఫీసర్లు మొదట ఆర్కే-8 డిస్పెన్సరీ, ఆ తరువాత రామకృష్ణాపూర్​సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాంచందర్​ చనిపోయాడని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మృతికి కారణాలు తెలుస్తాయని సింగరేణి డాక్టర్లు తెలిపారు. 

మృతుడి నుదిటిపై గాయమై రక్తస్రావం జరిగిందని తోటి కార్మికులు చెప్పారు. మృతుడు పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్​కు చెందినవాడు. రామకృష్ణాపూర్​ ఏరియా ఆసుపత్రిలో  రాంచందర్​ డెడ్​బాడీని కార్మిక సంఘాల లీడర్లు, శ్రీరాంపూర్​ జీఎం ఎం.శ్రీనివాస్, ఇందారం-1ఏ గని, ఓసీపీ పీవో ఏవీ రెడ్డి సందర్శించి నివాళులు అర్పించి, మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. 

రాంచందర్​ మృతిని మైన్​ యాక్సిడెంట్​గా పరిగణించాలని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ లీడర్​ ఎండీ.అక్బర్​అలీ, బాజీసైదా, టీబీజీకేఎస్​ వైస్​ ప్రెసిడెంట్​ పెట్టెం లక్ష్మణ్, హెచ్​ఎంఎస్​వైస్​ప్రెసిడెంట్​తిప్పారపు సారయ్య, అనిల్​రెడ్డి, సీఐటీయూ ప్రెసిడెంట్​బాలాజీ డిమాండ్​ చేశారు. అన్ని రకాల బెనిఫిట్స్, రూ.కోటి ఎక్స్​గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి డిపెండెంట్​ జాబ్​ఇవ్వాలని కోరారు.