
చిన్నచింతకుంట, వెలుగు: రెండు రోజుల కింద బాలుడు అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన ఎర్రమందెల అఖిల్(6) సోమవారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటూ తప్పిపోయాడు. ఈ విషయంపై తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు కంప్లైంట్ చేయగా.. పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే గ్రామ సమీపంలోని రాతి నీటి గుంటలో బుధవారం బాలుడి డెడ్బాడీని గుర్తించారు. నీటి గుంటలో నుంచి డెడ్బాడీని తీసి, పోస్టుమార్టం కోసం మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆర్ శేఖర్ తెలిపారు.