
కోరుట్ల, వెలుగు: గ్రూప్స్ సెలెక్ట్ కాలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి ఆకుల శృతి (27) పీజీ వరకు చదువుకొని గ్రూప్స్కు ప్రిపేర్ అవుతోంది. ఇటీవల విడుదల గ్రూప్స్లో విజయం సాధించలేకపోయింది. దీంతో చదువు కోసం డబ్బులు వృథా అయ్యాయన్న మనస్తాపంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకుంది. కొద్ది సేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తల్లి రోజా ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు.