మ్యాడ్, ఆయ్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. సంపద హీరోయిన్. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చింతపల్లి రామారావు నిర్మిస్తున్నారు. దసరాకు సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుంది. ప్రేమను ఎలక్షన్స్తో పోలుస్తూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. దర్శకుడు సతీష్ వేగేశ్న గారు గతంలో శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు.
ఈ సినిమా టీజర్ చూస్తే ఆయన ఫ్లేవర్లోనే మూవీ ఉంటుందని తెలుస్తోంది. మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. నార్నే నితిన్ నాకు ఎన్టీఆర్ గారి మ్యారేజ్ టైమ్ నుంచి తెలుసు. మ్యాడ్, ఆయ్ సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా ఎదుగుతున్నాడు. ఆయనకు మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందని నమ్ముతున్నా’ అని టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు.