ట్రైనీ ఆర్మీ అధికారులను దోచుకుని..స్నేహితురాలిపై గ్యాంగ్ రేప్

ట్రైనీ ఆర్మీ అధికారులను దోచుకుని..స్నేహితురాలిపై గ్యాంగ్ రేప్

 మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో దారుణం జరిగింది. ఇద్దరు ట్రైనీ ఆఫీసర్లపై దాడి చేసిన దుండగులు..వారి స్నేహితురాలిపై గ్యాంగ్  రేప్ చేశారు. దాడి చేసిన వారిలో ఇద్దరిని  పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే... ఇండోర్ సమీపంలో మోవ్ ఆర్మీ కాలేజీకి చెందిన  ఇద్దరు ట్రైనీ అధికారులు మరో ఇద్దరు మహిళలతో కలిసి  సెప్టెంబర్ 12న  చోటీ జామ్ దగ్గర ఫైరింగ్ రేంజ్ సమీపంలోని ప్రదేశానికి  వెళ్లారు. ఒక్కసారిగా 8 మంది దుండగులు  గన్స్ , కత్తులతో వచ్చి  వాళ్లను చుట్టుముట్టారు. వారిపై దాడి చేసి నగలను,డబ్బును తీసుకున్న దుండగలు..  స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో  ఒక ట్రైనీ ఆర్మీ ఆఫీసర్ తప్పించుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వాళ్లు ఘటనా స్థలానికి వచ్చే లోపు దుండగులు పారిపోయారు. 

ఒక మహిళకు వైద్య పరీక్షలు చేయగా...ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకుని  ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరికి క్రిమినల్ రికార్డు ఉందని చెప్పారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.