
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీం కోసం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో హౌసింగ్ కార్పొరేషన్ రిక్రూట్ చేస్కున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్(ఏఈ)లకు ట్రైనింగ్ ప్రారంభమైంది.
హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)లో సోమవారం నుంచి హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ట్రైనింగ్ ప్రారంభించారు. 6 రోజుల పాటు జరగనున్న ఈ ట్రైనింగ్కు మొత్తం 390 మంది రావాల్సి ఉండగా తొలిరోజు 300 మంది హాజరయ్యారు.