
ఖమ్మం టౌన్, వెలుగు : తెలంగాణలోని 14 సెంట్రల్ స్కూళ్ల టీచర్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యూకేషన్(సీబీఎస్ఈ) ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ ఇస్తున్నారు. ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించే ట్రైనింగ్ను శుక్రవారం హార్వెస్ట్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ పార్వంతి ప్రారంభించారు.
సీబీఎస్ఈ ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇవ్వనున్నారు. సీబీఎస్ఈ రిసోర్స్ పర్సన్స్ గా ఎంపికైన డిప్యూటీ డైరెక్టర్ జితేందర్ భట్టి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ మేనేజ్మెంట్ఆర్.ప్రసన్న కుమార్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ మేనేజ్మెంట్ ఇన్ గవర్నమెంట్ త్రివేండ్రం నుంచి సునీర్ నాగి,హైదరాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పల్లవి ఈ ట్రైనింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.