నాలుగు జిల్లాల ఫైర్​ స్టాఫ్​కు గోదావరిలో ట్రైనింగ్

నాలుగు జిల్లాల ఫైర్​ స్టాఫ్​కు గోదావరిలో ట్రైనింగ్
  •     రెస్క్యూ నిర్వహణపై డెమో

భద్రాచలం,వెలుగు : భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన 35 మంది ఫైర్​ స్టాఫ్​కు గురువారం ట్రైనింగ్​ నిర్వహించారు.  కొత్తగా కొనుగోలు చేసిన రిమోట్​ కంట్రోల్​ లైఫ్​ సేవింగ్​ బోట్ పై ట్రైనింగ్​, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జిల్లా ఫైర్​ ఆఫీసర్​ క్రాంతి పర్యవేక్షణలో ముంబైకి చెందిన శ్రీలలిత కంపెనీ ప్రతినిధి మనోజ్ సావన్​ ట్రైనింగ్​ ఇచ్చారు.

ప్రకృతి విపత్తులు సంభవించినపుడు కీలకమైన ఫైర్​ స్టాఫ్​ అనుసరించాల్సిన విధానాలను భద్రాచలం ఫైర్​ స్టేషన్​లో వివరించి, రిమోట్​ కంట్రోల్​ లైఫ్​ సేవింగ్​ బోట్​ ద్వారా రక్షించడంపై గోదావరిలో డెమో క్లాసులు ఇచ్చారు. భద్రాచలం, ఇల్లెందు ఫైర్​ ఆఫీసర్లు శ్రీనివాస్​, నవీన్​కుమార్​  కార్యక్రమంలో పాల్గొన్నారు.