
కోల్బెల్ట్, వెలుగు: కాళేశ్వరం జోన్-–1 పరిధిలోని పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల జిల్లాకు చెందిన నలుగురు ఎస్ఐలను ట్రాన్స్ఫర్ చేశారు. మందమర్రి ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రకుమార్ను లక్సెట్టిపేటకు, అక్కడి ఎస్ఐ ఎస్.లక్ష్మణ్ను రామగుండం వీఆర్కు, మందమర్రిలో రెండో ఎస్ఐగా పనిచేస్తున్న శివానికి అదే పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా బాధ్యతలు అప్పగిం చారు. రామగుండం వీఆర్లో కొనసాగు తున్న గుండెటి రాజవర్ధన్ను మంచిర్యాల టౌన్ నాలుగో ఎస్ఐగా బదిలీ చేశారు.