
తిర్యాణి, వెలుగు: నేషనల్ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు తిర్యాణి మండలంలోని పంగిడి మాదర ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ టెన్త్క్లాస్ స్టూడెంట్ టెకం సాయి ప్రసాద్ ఎంపికైనట్లు హెచ్ఎంహెం గోపాల్, పీడీ లక్ష్మణ్ తెలిపారు.
ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సాయి ప్రసాద్ప్రతిభ కనబరిచాడని, దీంతో ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగే నేషనల్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. స్టూడెంట్ను సర్పంచ్ జంగు, ఎంపీటీసీ కేశవరావు తదితరులు అభినందించారు.