
భద్రాచలం, వెలుగు : బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సిబ్బందిని ఎండోమెంట్ కమిషనర్ హన్మంతరావు శుక్రవారం సన్మానించారు. ఈవో రమాదేవితో పాటు ఈఈ రవీందర్రాజు, సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాసరావు, సుబ్బారావు, సీసీ శ్రీనివాసరెడ్డిని అభినందించారు.