
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణ ఆధ్వర్యంలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ సోమాజిగూడలో వివేక్ స్వగృహంలో కాంగ్రెస్ నాయకులు, విశాఖ ఉపాధ్యాయులు ఆయనను కలిశారు. అనంతరం పూలమాలలు, శాలువాలతో వివేక్ వెంకటస్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రుద్ర శంకర్, కోడి లక్ష్మన్, పొన్నం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.