
వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేసి శనివారం రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్లను ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి సన్మానించారు. పాన్ గల్ ఏఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి, మదనాపూర్ ఏఎస్ఐ గోపాల్రెడ్డి, పెద్దమందడి హెడ్ కానిస్టేబుల్ ఎం చెన్నయ్య రిటైర్ అయ్యారు. వారిని ఎస్పీ శాలువాలు, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో క్రమశిక్షణతో పని చేసి ప్రజలకు సేవలందించారని అభినందించారు. భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా తనను సంప్రదించాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పల నాయుడు పాల్గొన్నారు.