ఎకరానికి రూ.5 కోట్లిస్తేనే ట్రిపుల్​ఆర్​కు భూములిస్తం

ఎకరానికి రూ.5 కోట్లిస్తేనే ట్రిపుల్​ఆర్​కు భూములిస్తం
  • ట్రిపుల్​ఆర్​ భూ నిర్వాసితుల పోరాట ఐక్యవేదిక డిమాండ్​

జూబ్లీహిల్స్, వెలుగు: ప్రాణం పోయినా ట్రిపుల్​ఆర్​కోసం భూములు ఇవ్వబోమని చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్​కు రైతులు, బాధితులు తేల్చిచెప్పారు. ట్రిపుల్​ఆర్​భూ నిర్వాసితుల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం సాగర్​సొసైటీలోని నేషనల్​హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్​ఆఫీస్​వద్ద ఆందోళనకు దిగారు. 

ఐక్య వేదిక కన్వీనర్ దయాకర్​రెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్​విలువ ఎకరానికి రూ.5 కోట్లు ఉంటే.. ప్రభుత్వం కేవలం రూ.20 లక్షలు చెల్లించిందన్నారు. తమ భూములకు మార్కెట్​ధర చెల్లించాలని డిమాండ్​చేశారు. మూడేండ్ల నుంచి న్యాయం చేయాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర భాగంలోని అలైన్​మెంట్​ను ఓఆర్ఆర్ నుంచి 28 కిలోమీటర్లకు బదులుగా 40 కిలో మీటర్లకు మారుస్తూ కొత్త డీపీఆర్ తయారు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు