
ఐపీఎల్ -2024 లో భాగంగా 2024 మార్చి 27వ తేదీ మంగళవారం రోజున సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియా జట్లు మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్డేడియం ఇందుకు వేదిక కానుంది. సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ను వీక్షించేందుకు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాలని క్రికెట్ అభిమానులకు సూచించారు.
Also Read:ఐపీఎల్ మ్యాచ్.. బ్యాగులు, లగేజ్ తీసుకురావొద్దు
ఐపీఎల్ 17వ సీజన్ లో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఏడు మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ మార్చి 27న ముంబైతో.. . ఆ తర్వాత ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 25న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మే 2న రాజస్థాన్ రాయల్స్, మే 8న లక్నో సూపర్ జెయింట్స్, మే 16న గుజరాత్ టైటాన్స్, మే 19న పంజాబ్ కింగ్స్ జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మ్యాచ్లు హైదరాబాద్లో లేవు.