ట్రంప్ 25 శాతం టారిఫ్.. ఆటో కంపెనీలకు కష్టాలే

ట్రంప్ 25 శాతం టారిఫ్.. ఆటో కంపెనీలకు కష్టాలే

న్యూఢిల్లీ:  మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వెహికల్స్​, ఆటో పార్ట్స్​పై వచ్చే నెల నుంచి 25 శాతం సుంకాలు విధించడం వల్ల భారతీయ ఆటో కంపెనీలు నష్టపోతాయని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. మనదేశం నుంచి అమెరికాకు ఏడు బిలియన్​ డాలర్ల విలువైన ఆటో ఎగుమతులు జరుగుతున్నాయి. సుంకాల విధింపు వల్ల కంపెనీల మార్జిన్లు తగ్గుతాయని భావిస్తున్నారు. టాటా మోటార్స్​ లగ్జరీ కార్​ సబ్సిడరీ జాగ్వార్ ​ల్యాండ్ ​రోవర్​ గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు నాలుగు వేల వెహికల్స్​ను అమ్మింది. ఇవన్నీ యూకే ప్లాంట్ల నుంచి వెళ్లాయి. 

టారిఫ్​ వసూలు చేయడం వల్ల కంపెనీ లాభదాయకత తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. టారిఫ్​ల భారాన్ని తట్టుకోవడానికి జేఎల్​ఆర్​ధరలు పెంచాలి. ఇదే జరిగితే మార్కెట్​షేర్​తగ్గవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.  స్పేర్​పార్ట్స్​తయారు చేసే కంపెనీలపై మరింత ప్రభావం ఉండొచ్చని అంటున్నారు. గత ఏడాది యూఎస్​మనదేశం నుంచి 2.2 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను కొన్నది. అమెరికాకు ఎగుమతి చేసే స్పేర్ పార్ట్స్ ధర పెరుగుతుంది కాబట్టి అమ్మకాలు తగ్గే ప్రమాదం ఉంది.  మనదేశం నుంచి ఆటో పార్టులు ఎగుమతి చేసే సోనా బీఎల్​డబ్ల్యూ  ప్రెసిషన్ ఫోర్జింగ్స్, భారత్ ఫోర్జ్, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్  వంటి కంపెనీలకు సుంకాల దెబ్బ గట్టిగానే తగలనుంది. సోనా బీఎల్​డబ్ల్యూ ఆదాయంలో 43 శాతం, భారత్​ఫోర్జ్​  ఆదాయంలో 38 శాతం అమెరికా నుంచే వస్తోంది. 25 శాతం టారిఫ్​కట్టడం వల్ల కంపెనీల మార్జిన్​150 బేసిస్​పాయింట్ల వరకు పడిపోవచ్చని క్రిసిల్​ తెలిపింది.