అమెరికాలో ఉంటున్న మనోళ్లు వెనక్కి.. 205 మందిని ఎందుకు పంపించేశారు..?

అమెరికాలో ఉంటున్న మనోళ్లు వెనక్కి.. 205 మందిని ఎందుకు పంపించేశారు..?
  • 205 మందితో అమెరికా నుంచి బయలుదేరిన విమానం
  • పంజాబ్లోని అమృత్​సర్కు చేరుకుంటుందని మీడియా కథనాలు
  • ఇమిగ్రేషన్​చట్టాలను కఠినతరం చేసిన ట్రంప్​సర్కారు.. 18వేల మంది ఇండియన్స్తో లిస్ట్​ రెడీ..  ​
  • ఒక్కొక్కరినీ క్షుణ్నంగా తనిఖీ చేశాకే తరలిస్తున్నట్టు అధికార వర్గాల వెల్లడి

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్​ బాధ్యతలు చేపట్టాక తాను చెప్పినట్టే చేసి చూపిస్తున్నారు. అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్​ చట్టాలను ట్రంప్​ సర్కారు కఠినతరం చేయడంతో అమెరికా హిస్టరీలోనే అతిపెద్ద డిపోర్టేషన్​ ఆపరేషన్​ మొదలైంది. ఈ క్రమంలో అమెరికాలో ఎలాంటి పత్రాలు లేకుండా ఉంటున్న భారతీయులను  వెనక్కి పంపిస్తున్నారు.

సోమవారం 205 మంది ఇండియన్ మైగ్రేంట్స్​తో కూడిన విమానం  భారత్​కు బయలుదేరినట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి. సీ17 అనే ఎయిర్​క్రాఫ్ట్​లో సాంట్​ఆంటోనియా నుంచి విమానం బయలుదేరిందని, పంజాబ్​లోని అమృత్​సర్​కు చేరుకుంటుందని పేర్కొన్నాయి. మైగ్రేంట్స్​ను వెనక్కి పంపే ముందు ఒక్కొక్కరినీ క్షుణ్నంగా తనిఖీ చేసినట్టు అమెరికా అధికార వర్గాల సమాచారం.

అయితే, ఈ ప్రక్రియపై యూఎస్ ఎంబసీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ‘‘యూఎస్​ తన సరిహద్దును బలోపేతం చేస్తున్నది. ఇమ్మిగ్రేషన్​చట్టాలను కఠినతరం చేస్తున్నది. సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారిని అరెస్టు చేసి వెనక్కిపంపుతున్నది. అక్రమ వలసలు ప్రమాదకరం అనే మెసేజ్​ పంపుతున్నది” అని ఓ ప్రతినిధి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, త్వరలోనే ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఉన్న నేపథ్యంలో ఇండియన్ల​ తరలింపు ప్రాధాన్యత సంతరించుకున్నది. తన పర్యటనలో మోదీ ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఉన్నదని తెలుస్తోంది.

7.5 లక్షల మంది ఇండియన్లు..
అమెరికాలో సరైన పత్రాలు లేకుండా 7.50 లక్షల మంది భారతీయ వలసదారులు ఉంటున్నట్టు ప్యూ రీసెర్చ్​సెంటర్​ అంచనా. మెక్సికో, ఎల్​ సాల్వడార్​తర్వాత భారతీయుల సంఖ్యే అధికమని తేల్చింది.  అయితే, వీళ్లందరినీ వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతున్నదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 18వేల మంది ఇండియన్స్​తో కూడిన ఫస్ట్​ లిస్ట్​ను యూఎస్​ ఇమ్మిగ్రేషన్​ అండ్​ కస్టమ్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ రూపొందించినట్టు సమాచారం. 

కాగా, ఇల్లీగల్​ మైగ్రేంట్స్​పై అమెరికా తీసుకున్న నిర్ణయంపై భారత్​ ఇప్పటికే తన స్పందన తెలియజేసింది. అక్రమ వలసలకు తాము కూడా వ్యతిరేకమని తెలిపింది. ఎలాంటి పత్రాలు లేని, వీసా గడువు ముగిసిన ఇండియన్స్​ అమెరికాసహా ఎక్కడున్నా భారత్​కు వచ్చేందుకు తాము వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.