వచ్చే వారం ప్రధాని మోదీని కలుస్తా: అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్

వచ్చే వారం ప్రధాని మోదీని కలుస్తా: అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని వచ్చే వారంలో కలుస్తానని ఆ దేశ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. బుధవారం మిచిగాన్​లో నిర్వహించిన ఎన్నికల క్యాంపెయిన్​లో ఆయన ఈ విషయం ప్రకటించారు. త్వరలోనే మోదీ తనను కలుస్తారని చెప్పారు. మోదీ ఓ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడుతూనే, మన దేశ వాణిజ్య విధానాన్ని ట్రంప్ తప్పు పట్టారు. 

దిగుమతులపై భారత్ భారీగా ట్యాక్స్​లు విధిస్తోందని అన్నారు. నిజానికి ట్రంప్ దేశాధ్యక్షుడు కానప్పటికీ, ఇతర దేశాల అధినేతలు అమెరికాకు వచ్చినప్పుడల్లా కలుస్తూనే ఉన్నారు. 2020 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ మనదేశానికి వచ్చినప్పుడు ఆయన మోదీతో చివరిసారిగా భేటీ అయ్యారు.

మోదీ మూడ్రోజుల పర్యటన
ప్రధాని మోదీ సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటిస్తారు. మొదటిరోజు డెలావర్​లో క్వాడ్ సమిట్​లో పాల్గొంటారు. న్యూయార్క్​లోని లాంగ్ ఐలాండ్​లో జరిగే కార్యక్రమంలో ఎన్ఆర్​ఐలతో భేటీ అవుతారు.