
వాషింగ్టన్: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ పౌరులు తమ దేశంలోకి ప్రవేశించ కుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ రెండు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నారు. భద్రత, రిస్కు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పాక్, అఫ్గాన్పై ప్రెసిడెంట్ నిషేధాన్ని అమలు చేయనున్నారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.
దీనికి సంబంధించిన లిస్ట్ ప్రిపేర్ అవుతోందని, వచ్చే వారంలో అమల్లో కి రావొచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ లిస్టులో పాక్, అఫ్గాన్ తో పాటు మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయని వెల్లడించాయి. కాగా.. ట్రంప్ తన మొదటి టర్ములో ఏడు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాక 2021లో ఆ నిషేధాన్ని ఉపసంహరించారు.