
కేయూ క్యాంపస్, వెలుగు: బీఎడ్కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్2025కు ఈ నెల 12 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని కాకతీయ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, కన్వీనర్బి.వెంకట్రామ్రెడ్డి వర్సిటీ అధికారులతో కలిసి టీజీ ఎడ్సెట్నోటిఫికేషన్ను రిలీజ్చేశారు. ఈ నెల 12 నుంచి మే 13వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 లేట్ఫీజుతో మే 20వ తేదీ వరకు, రూ.500 లేట్ఫీజుతో మే 24వ తేదీ వరకు అప్లై చేసుకొనే చాన్స్ఇచ్చారు.
అర్హత కలిగిన అభ్యర్థులంతా ఆన్ లైన్లో దరఖాస్తులు సబ్మిట్చేయాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550, మిగతా వాళ్లు రూ.750 చెల్లించి రిజిస్ట్రేషన్చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, జూన్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు సెషన్లలో ఎంట్రెన్స్టెస్ట్ నిర్వహించనున్నారు.