గవర్నమెంట్ గుడ్‌న్యూస్ : వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు

గవర్నమెంట్ గుడ్‌న్యూస్ : వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు

హైదరాబాద్ : చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు సీఎం కీలక ఆదేశాలు పంపారు. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు... మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు16 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేందుకు ఇప్పటికే అధికారులు సర్వే చేశారు. 10,200 మంది నిర్వాసితులు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్ మరియు మేడ్చల్‌.. మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు బృందాలుగా ఏర్పడి బుధవారం (సెప్టెంబర్ 25)న ఇంటింటికి వెళ్లి వారికి ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారో తెలియజేస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ముందుగా రివర్ బెడ్ ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. మూసీ బఫర్ జోన్ లో  నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మాణ ఖర్చుతో పాటు, వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. 2 BHK ఇల్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు.