TSPSC: గ్రూప్ -4 ఫలితాలు విడుదల

TSPSC: గ్రూప్ -4 ఫలితాలు విడుదల

హైదరాబాద్: ఎట్టకేలకు గ్రూప్-4 ఫలితాలను విడుదల చేసింది టీఎస్ పీఎస్సీ. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును వెల్లడించింది.గతేడాది (2023) జూన్ లో గ్రూప్-4 పరీక్షలను టీఎస్ పీఎస్సీ నిర్వహించింది. అభ్యర్థులు తమ ర్యాంకులను www.tspsc.gov.in వెబ్ సైట్ లో చూసుకోవాలని తెలిపింది. మొత్తం 8,180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా. 7లక్షల 26వేల 837 మంది అభ్యర్థుల ర్యాంకులను విడుదల చేసింది.  త్వరలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ ను విడుదల చేస్తమని తెలిపింది. 

ALSO READ :- కోడికత్తి శ్రీను జైలునుంచి బయటికొచ్చాడు