
డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జులై 2023 టర్మ్ ఎనిమిదో తరగతిలో అడ్మిషన్స్కు తెలంగాణకు చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. 1 జులై 2023 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, వైవా వాయిస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా వాయిస్ నిర్వహిస్తారు. దీనిలో కనీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి. చివరగా మెడికల్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తులు: ఆఫ్లైన్ ద్వారా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), నాంపల్లి, హైదరాబాద్, తెలంగాణ-500001 అనే అడ్రస్కు అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.555 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. డిసెంబర్ 3న ఎగ్జామ్ నిర్వహిస్తారు. వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.