డీసీఎం బోల్తా.. 14 ఆవులు మృతి

డీసీఎం బోల్తా.. 14 ఆవులు మృతి

నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారిపై పశువుల లోడ్​తో వెళుతున్న వాహనం బోల్తా పడింది.  నార్కెట్​పల్లి వివేరా హోటల్​ వద్ద బస్సును ఢీకొన్న డీసీఎం బోల్తా పడింది.  డీసీఎం పశువుల లోడ్​తో ఉండటం వలన .... ఈ ఘటనలో 14 ఆవులు మృతి చెందాయి. అయితే వాహనంలో 50 వరకు ఆవులు ఉన్నాయని సమాచారం అందుతోంది.  ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్​ పరారయ్యాడు.  సమాచారం అవదుకున్న నార్కెట్​పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.