
- మరో వ్యక్తికి తీవ్ర గాయాలు..
- ఖమ్మం జిల్లా రూరల్ మండలం దానవాయిగూడెంలో విషాదం
ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కవల సోదరులు కన్నుమూశారు.రూరల్ మండలం దానవాయిగూడెం గ్రామానికి చెందిన అత్తులూరి నర్సింహారావు, రమ దంపతులకు మహేశ్(24), నవీన్ (24) అనే ఇద్దరు ట్విన్స్ఉన్నారు. మహేశ్ కూసుమంచిలో మెకానిక్ కాగా, నవీన్ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. మంగళవారం పని ఉండడంతో కూసుమంచి మండలం పెరికసింగారం గ్రామానికి అన్నదమ్ములతో పాటు మరో వ్యక్తి టూవీలర్పై వెళ్తున్నారు. వీరి బండిపై ఇంజిన్ఆయిల్ డబ్బాల బాక్స్ కూడా ఉంది.
మద్దులపల్లికి ముందు ఓ మూలమలుపుపై సూర్యాపేట వైపు నుంచి వస్తున్న టాటా ఏస్ వ్యాన్ వీరి బైక్ను ఢీకొట్టింది. కంట్రోల్ చేసుకోవాలని చూసినా బైక్పై డబ్బాలు ఉండడంతో వీలు కాలేదు. దీంతో మహేశ్, నవీన్అక్కడిక్కడే చనిపోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, మృతుల తండ్రి నర్సింహారావు హైదరాబాద్లో ఉన్నట్లు తెలిసింది. రూరల్ఎస్ఐ రామారావు, సీఐ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు., కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.