డ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు అరెస్ట్

డ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు అరెస్ట్

పంజాగుట్ట,వెలుగు: బెంగళూరు నుంచి డ్రగ్స్​తెచ్చి సిటీలో అమ్ముతుండగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్​చేశారు. నిందితుల వద్ద 16 గ్రాముల ఎండీఎంఏ, సెల్​ఫోన్​స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎస్ఆర్ నగర్​ పీఎస్ లో బుధవారం మీడియా సమావేశంలో ఏసీపీ పి.వెంకట రమణ, నార్కోటిక్స్​ డీఎస్పీ శ్రీధర్​ వివరాలు వెల్లడించారు. మల్కాజ్​గిరికి చెందిన మాథ్యూస్​సంజయ్​(23) కుక్కలను పెంచుతూ అమ్ముతుంటాడు. 

కొంతకాలంగా మాథ్యూస్​బెంగళూరు నుంచి డ్రగ్స్​తీసుకొచ్చి అమ్ముతున్నాడు. సమాచారం అందడంతో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్​బ్యూరో , సంజీవరెడ్డినగర్​ పోలీసుల దాడులు చేశారు. మాథ్యూస్ తో పాటు కొనుగోలుదారుడిని అరెస్ట్​ చేశారు. మాథ్యూస్​ను విచారించగా బెంగళూరుకు చెందిన అసదుల్లా వద్ద డ్రగ్ కొనుగోలు చేస్తున్నట్టు తెలిపాడు. ఇప్పటికే  మాథ్యూస్​ 9మందికి  డ్రగ్​అమ్మినట్టు చెప్పడంతో  వారిని అదుపులోకి తీసుకుంటామని ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఇన్​స్పెక్టర్ శ్రీనాథ్​రెడ్డి, డీఐ జానకి రాములు, ఎస్ఐ రాజు రాథోడ్​ పాల్గొన్నారు.