కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు 

కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు 
  • కండువాలు కప్పిన మైనంపల్లి హన్మంతరావు

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట మున్సిపాల్టీకి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో గురువారం కాంగ్రెస్ లో చేరారు. 43వ వార్డు కౌన్సిలర్ పయ్యావుల పూర్ణిమ ఎల్లం, 14 వ వార్డు కౌన్సిలర్ ఆలకుంట కవితలతో పాటు మరో ఐదురుగురు నాయకులు హైదరాబాద్ లో కాంగ్రెస్ లో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి మైనంపల్లి హన్మంతరావు పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ పాల్గొన్నారు. ఇటీవలే ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరగా ఇప్పుడు ఇద్దరి చేరికతో కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య ఐదుకు చేరింది. చైర్ పర్సన్ భర్త అవినీతిని వ్యతిరేకించే తాము పార్టీని వీడామని కౌన్సిలర్లు పేర్కొన్నారు.